కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక తమ కలలు సాకారమవుతాయని, వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తారని సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి వారి ఆశలు రెట్టింపయ్యాయి. సీఎం ఎప్పుడు సానుకూల నిర్ణయం తీసుకుంటారోనని ఎదురుచూస్తున్నారు. రెండు, మూడేళ్లలో ఉద్యోగ విరమణ పొందే కార్మికులు 12వేల నుంచి 15వేల వరకు ఉంటారు. వీరంతా ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు.
శ్రీరాంపూర్(ఆదిలాబాద్) : ఉద్యమ నేపథ్యంలో కేసీఆర్.. సింగరేణిలో పర్యటించిన ప్రతీసారి కార్మికుల కలలను నెరవేర్చుతానని హామీ ఇస్తూ వచ్చారు. తెలంగాణ ఏర్పడ్డాక ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి అన్నట్టుగానే అమలు చేశారు. లాభాల్లో వాటాశాతాన్ని పెంచేలా చర్యలు చేపట్టారు. అలాగే వారసత్వ ఉద్యోగాలను ఇప్పిస్తామని భరోసా ఇచ్చిన కేసీఆర్... ఆ హామీని నెరవేర్చాలని కార్మికులు కోరుతున్నారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ కూడా ఈ అంశంపైనే కార్మికులకు మాటిచ్చిందని, ఆ మేరకు ఇటు ప్రభుత్వం, అటు సింగరేణి యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొచ్చి కార్మికులకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
వెక్కిరిస్తున్న ఖాళీలు
సింగరేణిలో ఇప్పటివరకు ఏర్పడిన ఉద్యోగ ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. కంపెనీలో 35 భూ గర్భ గనులు, 15 ఓసీపీలు ఉన్నాయి. 62 వేల పైచిలుకు కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో 55 ఏళ్ల వయసు ఉన్నవారు 70 శాతం మంది ఉంటారు. దీనికి తోడు ఇతర కేటగిరీల్లో ఇప్పటికే ఖాళీలు ఉన్నాయి. మైనింగ్ స్టాఫ్ నుంచి మొదలు కొని ట్రేడ్స్మెన్ వరకు కొరత తీవ్రం గా ఉంది. సూపర్వైజర్ సిబ్బంది పోస్టులే 1,500 వరకు ఖాళీ ఉన్నాయి. క్లర్కులు, ఆఫీస్ బాయ్లు కూడా సరిపడా లేరు. ఈ క్రమంలో వారసత్వ ఉద్యోగ హక్కును పునరుద్ధరిస్తే, ఖాళీలను భర్తీ చేయడమే కాకుండా కార్మిక కుటుంబాలకు ఆధారం లభించినట్లవుతుందనే చర్చ సాగుతోంది.
సింగరేణి కార్మికుల ఆశలు...
Published Sat, Oct 11 2014 2:34 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement