చిత్రహింసలు పెడుతుండ్రు | Sakshi
Sakshi News home page

చిత్రహింసలు పెడుతుండ్రు

Published Sun, Dec 10 2017 3:00 AM

Siddipet district resident in Saudi - Sakshi

దుబ్బాక రూరల్‌: బతుకుదెరువు కోసం గల్ఫ్‌ దేశానికి వెళ్లిన తన భర్తను చిత్రహింసలకు గురి చేస్తున్నారని, వెంటనే అతడిని ఇక్కడికి రప్పించాలని సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అచ్చుమాయిపల్లి గ్రామానికి చెందిన దేవవ్వ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. గ్రామానికి చెందిన సారుగు గోపాల్‌ (33) గతేడాది సౌదీ వెళ్లాడు.

ఏజెంట్ల మోసానికి బలైన అతను అక్కడికెళ్లాక ఒంటెలు కాసే పనికి కుదిరాడు. మూడు రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైనట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. స్వదేశానికి రాకుండా వీసా, పాస్‌పోర్టు లాక్కున్నారు. గోపాల్‌తో పాటు మరికొందరు కామారెడ్డి జిల్లావాసులు ఇలాగే బాధపడుతున్నట్టు సమాచారం అందిందని దేవవ్వ తెలిపింది. ప్రభుత్వం స్పందించి వెంటనే రప్పించాలని వేడుకుంది.

Advertisement
Advertisement