భద్రాచలం, న్యూస్లైన్: ముంపు మండలాలను తెలంగాణలోనే ఉంచాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ముంపు ప్రాంతాలను తెలంగాణలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ భద్రాచలంలో ఎమ్మెల్యే సున్నం రాజయ్య గురువారం చేపట్టిన ఆమరణదీక్షను ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు నాయకులతో కలిసి సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీ జాతిని విచ్ఛిన్నం చేసే విధంగా ముంపు మండలాలను విడదీయడం దుర్మార్గమైన చర్య అని ఆరోపించారు. ముంపు మండలాల విలీనంపై కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆదివాసీల మనుగడ కోసం వారి పక్షాల నిలుస్తామని, అవసరమైతే వారి కోసం ఆత్మహత్యకైనా సిద్ధమేనని అన్నారు. ముంపు మండల ప్రజల ఓట్లతో గెలిచిన తాము వారికి కృతజ్ఞతలు కూడా తెలిపే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలకు వ్యతిరేకంగా పార్టీ పరంగా ఎంతటి పోరాటాలకైనా సిద్ధమేనని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని అన్నారు. చిన్న, సన్నకారు రైతులు, మైనార్టీలకు భరోసా ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. భయాందోళనల్లో ఉన్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని, అప్పటి వరకు ఆర్డినెన్స్ నిలిపివేయాలని కోరారు.
సీపీఎం చేపట్టిన ఈ దీక్షలకు పూర్తి సంఘీభావం తెలుపుతున్నట్లు ప్రకటించారు. వైఎస్సార్సీపీ నాయకులు డాక్టర్ తెల్లం వెంకట్రావ్ మాట్లాడుతూ ముంపు మండలాలను సీమాంధ్రలో కలపడం వల్ల ప్రజలు ఆందోళనకు లోనవుతున్నారని, ప్రజాభిప్రాయం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అన్యాయమన్నారు. ముంపు మండలాలను వెనక్కు తీసుకువచ్చేందుకు చేపట్టే ఆందోళన కార్యక్రమాలకు వైఎస్సార్సీపీ కలసివస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ బీసీ సెల్ రాష్ట్ర కమిటీ సభ్యులు కడియం రామాచారి, సీనియర్ నాయకులు మంత్రిప్రగడ నర్సింహారావు, జిల్లా కమిటీ సభ్యులు కొవ్వూరి రాంబాబు, గంటా కృష్ణ, మహిళా నాయకురాలు దామెర్ల రేవతి, ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.
ముంపు మండలాలను తెలంగాణలోనే ఉంచాలి
Published Fri, May 30 2014 1:46 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటీటీకి వచ్చేస్తోన్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘ప్రజ్వల్ రేవణ్ణ’ పై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ
20 ఏళ్ల తర్వాత 'మన్మథుడు' హీరోయిన్ రీఎంట్రీ.. కాకపోతే!
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్ విషయం..!
కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. డ్రెస్సింగ్ రూంలో అలా!
మెట్ గాలాలో మెరిసిన ఆలియా.. ఆ చీరకు ఎందుకంత క్రేజ్ అంటే?
నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement