ఏసీబీ కోర్టుకు హాజరైన సండ్ర | sandra venkata veeraiah attends at acb court | Sakshi
Sakshi News home page

ఏసీబీ కోర్టుకు హాజరైన సండ్ర

Jul 21 2015 11:13 AM | Updated on Aug 17 2018 12:56 PM

ఓటుకు కోట్లు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విచారణలోభాగంగా మంగళవారం ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు.

హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గోదావరి పుష్కరాలకు హాజరయ్యేందుకు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణలో భాగంగా మంగళవారం ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఓటుకు కోట్లు కేసులో అరెస్టయిన సండ్ర వెంకట వీరయ్యకు గత వారం షరతులతో కూడిన బెయిల్‌ను ఏసీబీ ప్రత్యేక కోర్టు మంజూరు చేసింది.

 

ఏసీబీ దర్యాప్తులో జోక్యం చేసుకోరాదని, ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరుకావాలని ,  నియోజకవర్గం వదిలి వెళ్లకూడదని కోర్టు షరతులు విధించింది.కాగా, పుష్కరాలకు హాజరు కావడానికి తనకు అనుమతి ఇవ్వాలంటూ ఇటీవల సండ్ర కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. పిటిషన్ పై తదుపరి విచారణను ఈనెల 23వ తేదీకి వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement