కొప్పుల ఈశ్వర్‌ కారుకు ప్రమాదం : ఒకరి మృతి | Road accident on karimnagar bypass road one died | Sakshi
Sakshi News home page

కొప్పుల ఈశ్వర్‌ కారుకు ప్రమాదం : ఒకరి మృతి

Feb 27 2018 2:45 AM | Updated on Aug 30 2018 4:20 PM

Road accident on karimnagar bypass road one died - Sakshi

ప్రమాదానికి గురైన కొప్పుల ఈశ్వర్‌ కారు

కరీంనగర్‌ క్రైం: కరీంనగర్‌లోని గోదావరిఖని బైపాస్‌ రోడ్డులో ప్రభుత్వ చీఫ్‌విప్‌ కొప్పుల ఈశ్వర్‌ వాహనాన్ని మరోకారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన కుందారపు గోపాల్‌ మరో వ్యక్తితో కలసి కరీంనగర్‌ వైపు ఆల్టో కారులో వస్తున్నాడు.

కరీంనగర్‌ హౌసింగ్‌బోర్డు కాలనీ వద్ద కొప్పుల ఈశ్వర్‌ డ్రైవర్‌ యూ టర్న్‌ తీసుకుంటుండగా గోపాల్‌ కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో గోపాల్‌ కారులోనే మృతిచెందాడు. మరోవ్యక్తి తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో ఈశ్వర్‌ కారులో లేరు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement