నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఏడు రోజుల పసికందు, బాలింత,మరో ఇద్దరు దుర్మరణం
అందరూ ఒకే కుటుంబానికి చెందినవారు
కోజన్కొత్తూర్లో విషాదం
పాప పుట్టిందన్న ఆనందం వారం రోజులకే ఆవిరైంది. నిజామాబాద్ జిల్లాలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పసికందు, పచ్చిబాలింతరాలైన తల్లితోపాటు మరో ఇద్దరు కుటుంబ సభ్యులను బలిగొంది. మహాలక్ష్మిని ఇంటికి తీసుకువస్తున్న సమయంలో మృత్యుదేవత కబళించడంతో మృతుల స్వగ్రామం కోజన్కొత్తూర్లో విషాదం అలుముకుంది.
ఇబ్రహీంపట్నం :నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం గాండ్లపేట శివారులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోజన్కొత్తూర్ గ్రామానికి చెందిన నలుగురు మృతిచెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. కోజన్కొత్తూర్కు చెందిన సుంకరి నర్సయ్య, రాంబాయి దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. కుమార్తెలిద్దరికీ వివాహమైంది. నర్సయ్య, చిన్న కుమారుడు వినోద్ ఉపాధి నిమిత్తం దుబాయి వెళ్లివస్తున్నారు. రెండు నెలల క్రితం పెద్ద కుమారుడు గంగనర్సయ్య వివాహానికి హాజరైన వారిద్దరు వారం క్రితమే దుబాయి తిరిగెళ్లారు. పెద్ద కూతురు సుజాత(27) వివాహం నిజామాబాద్ జిల్లా గుత్పకు చెందిన పిట్ల ప్రవీణ్తో జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉండగా, సుజాత వారం క్రితం ఆర్మూర్ ఆస్పత్రిలో కూతురికి జన్మనిచ్చింది. వీరిని ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చేందుకు రాంబాయి(45) కొడుకు గంగ నర్సయ్య, చిన్న కూతురు సుమలత(25)తో కలిసి అద్దెకారులో ఆర్మూర్ వెళ్లింది. సుజాతను, వారం రోజు ల పసికందును తీసుకుని అదేకారులో తిరుగుపయన మయ్యారు.
నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం గాండ్లపేట శివారులో 63వ నంబర్ జాతీయ రహదారిపై వీరి కారు ఓవర్టేక్ చేయబోయి మరో కారు, డీసీఎం వ్యాన్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాంబాయి అక్కడికక్కడే మృతి చెందింది. సుజాతను జగిత్యాల ఆస్పత్రికి తరలిస్తుండగా, సుమలత, సుజాత కూతురు(ఏడు రోజుల పసికందు)ను మెట్పల్లి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. రాంబాయి పెద్ద కుమారుడు గంగనర్సయ్య, కారు డ్రైవర్ బోదాసు రాజేందర్ పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్కు తీసుకెళ్లారు. విషయం తెలిసి దుబాయిలో ఉన్న నర్సయ్య, వినోద్ స్వదేశానికి బయల్దేరారు. మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి.
ఆవిరైన ఆనందం
Published Fri, Jun 20 2014 3:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్
ఒకే కాన్పులో ఐదుగురికి జన్మనిచ్చిన తల్లి!
హైదరాబాద్ లో బీర్లు కరువు
ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)
బాబు, లోకేష్ కు నోటీసులు..?
స్టార్ ప్రొడ్యూసర్ పరువు తీసిన కామెడీ షో.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
చిరంజీవి గురించి నేను ఏనాడూ మాట్లాడలేదు: ముద్రగడ
అప్పుడు భాషాలా.. ఇప్పుడు దావూద్ ఇబ్రహీంలా..
ప్రచారంలో దూసుకుపోతున్న జగన్
‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement