రేవంత్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా | Revanth Reddy's bail petition case adjourned till friday | Sakshi
Sakshi News home page

రేవంత్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

Jun 24 2015 10:52 AM | Updated on Aug 31 2018 9:15 PM

రేవంత్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా - Sakshi

రేవంత్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

ఓటుకు కోట్లు వ్యవహారంలో అరెస్ట్ అయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్పై వాదనలు మరోసారి వాయిదా పడ్డాయి.

హైదరాబాద్ :  ఓటుకు  కోట్లు కేసులో  రేవంత్‌ బెయిల్‌ పిటీషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. అడిషనల్‌ కౌంటర్‌ దాఖలు చేసేందుకు రెండు రోజుల సమయం కావాలని తెలంగాణ అడ్వకేట్‌ జనరల్‌ హైకోర్టును కోరారు. ఈమేరకు శుక్రవారం మధ్యాహ్నం 2.15 గంటల వరకు హైకోర్టు గడవు ఇస్తూ.. విచారణ వాయిదా వేసింది.  దాంతో  బెయిల్ పిటిషన్పై ఎలాంటి వాదనలు జరగకుండానే కేసు వాయిదా పడింది. కాగా ఈరోజు ఉదయం రేవంత్ రెడ్డికి చర్లపల్లి జైల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న మత్తయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ శివశంకర్రావు విచారించనున్నారు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement