గజ్వేల్‌ కోర్టులో రేవంత్‌రెడ్డి | Revanth Reddy Attended To Gajwel Court | Sakshi
Sakshi News home page

గజ్వేల్‌ కోర్టులో రేవంత్‌రెడ్డి

Jan 8 2020 3:14 AM | Updated on Jan 8 2020 3:14 AM

Revanth Reddy Attended To Gajwel Court - Sakshi

గజ్వేల్‌: టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి మంగళవారం గజ్వేల్‌ కోర్టుకు హాజరయ్యారు. 2015 అక్టోబర్‌ 10న టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు ఎమ్మెల్యే హోదాలో హాజరై సంఘీభావం ప్రకటించిన సందర్భంలో సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి దూషణలు చేశారని ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి రేవంత్‌రెడ్డి కోర్టులో హా జరయ్యారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షుడు, గ జ్వేల్‌ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, కాంగ్రెస్‌ నేతలు నాయిని యాదగిరి, సాజిద్‌బేగ్, న్యాయవాది గోపాల్‌రావు తదితరులు ఉన్నారు. ఇదే కేసులో అప్పటి టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ప్రస్తుత బీజేపీ ఆలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి శోభారాణి సైతం కోర్టుకు హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement