యువకుడి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

యువకుడి ఆత్మహత్య

Published Sat, Oct 10 2015 11:37 AM

ramesh committed suicide in rangareddy district

చేవెళ్ల(రంగారెడ్డి): పొలం దగ్గరికి వెళ్తున్ననని చెప్పి వెళ్లిన యువకుడు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరిగిద్ద గ్రామంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన రమేష్(20) ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పొలానికి వెళ్తున్నానని చెప్పి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

Advertisement
Advertisement