'ఆయన విదేశాల్లోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు' | Sakshi
Sakshi News home page

'ఆయన విదేశాల్లోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు'

Published Fri, Apr 10 2015 1:25 PM

'ఆయన విదేశాల్లోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు' - Sakshi

హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీ దేశంలో కంటే విదేశాల్లో ఎక్కవ కాలం గడుపుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. శుక్రవారం హైదరాబాద్లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... దేశంలోని నెలకొన్న సమస్యలు పరిష్కరించడంలో ప్రధాని మోదీ శ్రద్ధ చూపడం లేదని ఆరోపించారు.

స్వచ్ఛభారత్, గ్రామాల దత్తత వంటి కార్యక్రమాలు చేపట్టడం తప్ప... ఎన్నికల హామీలను మోదీ ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. రైతు వ్యతిరేక విధానాలు, పీడీపీతో పొత్తు, మన్మోహన్ సింగ్పై విచారణ వంటి అంశాలతో మోదీ గ్రాఫ్ పడిపోయిందని పొన్నం ప్రభాకర్ తెలిపారు.

Advertisement
Advertisement