బాధ్యతలు స్వీకరించిన పార్థసారధి | Sakshi
Sakshi News home page

బాధ్యతలు స్వీకరించిన పార్థసారధి

Published Thu, Apr 16 2015 12:42 AM

parthasaradhi take charge in agriculture department

హైదరాబాద్ సిటీ: తెలంగాణ వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శిగా పార్థసారధి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కొన్ని ఫైళ్లను పరిశీలించారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు జరిగిన నష్టాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అనంతరం ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ఆయనకు స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు ఆ బాధ్యతల్లో పనిచేసిన పూనం మాలకొండయ్యకు వీడ్కోలు పలికారు.

Advertisement
Advertisement