తెలంగాణ డిప్యూటీ స్పీకర్గా పద్మా దేవేందర్ | Padma devender reddy as Telangana deputy speaker | Sakshi
Sakshi News home page

తెలంగాణ డిప్యూటీ స్పీకర్గా పద్మా దేవేందర్

Jun 10 2014 2:53 PM | Updated on Sep 2 2017 8:35 AM

తెలంగాణ డిప్యూటీ స్పీకర్గా పద్మా దేవేందర్

తెలంగాణ డిప్యూటీ స్పీకర్గా పద్మా దేవేందర్

డిప్యూటీ స్పీకర్ పదవికి పద్మా దేవేందర్ రెడ్డి పేరును ఖరారు చేశారు.

హైదరాబాద్: టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు డిప్యూటీ స్పీకర్ పదవికి పద్మా దేవేందర్ రెడ్డి పేరును ఖరారు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె గెలుపొందారు.

డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేశారు. బుధవారం సాయంత్రం వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. పద్మా దేవేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశముంది. ఇక తెలంగాణ శాసనసభ రేపటకి వాయిదా పడింది. రేపు ఉదయం 11 గంటలకు గవర్నర్ నరసింహన్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement