ట్యాంకర్ బీభత్సం: ఒకరి మృతి | one killed in road accident | Sakshi
Sakshi News home page

ట్యాంకర్ బీభత్సం: ఒకరి మృతి

Jul 16 2016 8:55 AM | Updated on Aug 30 2018 4:07 PM

మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం షాకాపూర్ టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం అర్ధరాత్రి సిమెంట్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది.

మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం షాకాపూర్ టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం అర్ధరాత్రి సిమెంట్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. టోల్‌ప్లాజా వద్ద నగదు చెల్లించేందుకు వరుసగా ఉన్న వాహానాలకు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సిమెంట్ ట్యాంకర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement