ఔటర్ రింగు రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు.
హైదరాబాద్ (గచ్చిబౌలి) : ఔటర్ రింగు రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. ఈ ఘటన నగరంలోని గచ్చిబౌలి ప్రాంతంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. గచ్చిబౌలికి చెందిన మురళి అనే వ్యక్తి బైకుపై వెళుతుండగా అదుపు తప్పి రెయిలింగ్ను ఢీకొట్టాడు. దీంతో సదరు అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మరొక వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు.