టీచర్లు స్కూళ్లకు వెళ్లాల్సిందే | No Holidays For The Teachers Says education Department In Telangana | Sakshi
Sakshi News home page

టీచర్లు స్కూళ్లకు వెళ్లాల్సిందే

Mar 17 2020 3:56 AM | Updated on Mar 17 2020 3:56 AM

No Holidays For The Teachers  Says education Department In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించినా టీచర్లు మాత్రం పాఠశాలలకు Ðððlళ్లాలని, పరీక్షల విధులను నిర్వర్తించాలని, పెండింగ్‌ పనులను పూర్తి చేసుకోవాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా డీఈవోలు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సోమవారం ఇంటర్మీడియెట్, పాఠశాల విద్యాశాఖ జిల్లాల అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  ఇంటర్‌ స్పాట్‌ వ్యాల్యుయేషన్‌ విధులు, టెన్త్‌ పరీక్ష విధులు పడిన వారు కచ్చితంగా వాటిని పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ మూసివేయకుండా, తరగతులను నిర్వహించిన పాఠశాలలకు నోటీసులు జారీ చేసినట్లు   చిత్రా రామచంద్రన్‌ తెలిపారు. ఇవేకాకుండా ఇంజనీరింగ్‌ కాలేజీలు తరగతులను నిర్వహిస్తున్నట్లు విద్యా శాఖ దృష్టికి వచ్చింది. వాటిపైనా చర్యలు చేపట్టేందుకు సిద్ధం అవుతోంది. అందులో మంత్రి మల్లారెడ్డి బంధువు విద్యా సంస్థ కూడా ఉన్నట్లు సమాచారం.  ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను కరోనా నేపథ్యంలో మాస్క్‌లతో అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులు మాస్క్‌లు ధరించి పరీక్షలకు హాజరు కావచ్చని వెల్లడించింది.

‘అంగన్‌వాడీ కేంద్రాలకూ సెలవులివ్వాలి’ 
కోవిడ్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ నేపథ్యంలో అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా సెలవులు ఇవ్వాలని తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రభుత్వాన్ని కోరింది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement