
సాక్షి,ఇందూరు: నిజామాబాద్ జిల్లాలో 2014 ఎన్నికల టీఆర్ఎస్ అనుకూల ఫలితాలు మళ్లీ రిపీట్ అయ్యాయి. కానీ అనూహ్యంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జాజుల సురెందర్ గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో గతంలో ఆయన నాలుగు సార్లు ఓటమి పాలయ్యారు. వరుసగా నాలుగు సార్లు ఒటమి పొందడం వల్ల ప్రజల్లో ఈసారి సానుభూతితో గెలుపొంది నిజామాబాద్లో కాంగ్రెస్ ఉనికిని కాపాడారు.టీఆర్ఎస్ కీలక నేత ఏనుగు రవీందర్ రెడ్డి ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ శాసన మండలి పక్షనేత షబ్బీర్ అలీ ఎన్నో ఆశలతో బరిలోకి దిగినా ఓటమి తప్పలేదు. మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి బోధన్లో వరుసగా రెండోసారి ఓటమి చెందారు.బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డి మరోసారి విజయం సాధించి తన పట్టు నిలుపుకున్నారు.
మిగతా 8 స్థానాల్లో నిజామాబాద్ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మెజార్టీ ఇచ్చి గెలిపించారు. నిజామాబాద్లో టీఆర్ఎస్ పార్టీ అమలుపరిచిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల వల్ల ప్రజల తీర్పును పదిలపరుచుకుంది.ఎంపీ కవిత ప్రచారం కూడా టీఆర్ఎస్ పార్టీకి, అభ్యర్థులకు కలిసి వచ్చింది.టీఆర్ఎస్ పార్టీ మరోసారి ప్రజాధారణ నిలబెట్టుకుంది.పలు నియోజకవర్గల్లో టీఆర్ఎస్ పార్టీకి ఉన్న బలమైన కేడర్ గెలుపులో కీలక పాత్ర పోషించింది.కాంగ్రెస్పార్టీ కూటమిగా మారి గెలుపు కోసం ప్రయత్నించినా ప్రజల మద్దతును ఒక్క స్థానంలో మాత్రమే పొందగలిగింది.
నిజమాబాద్ జిల్టా మోత్తం నియోజకవర్గాలు
నియోజకవర్గం పేరు | అభ్యర్థి పేరు | పార్టీ |
నిజమబాద్ (అర్బన్ ) | బిగాల గణేష్ గుప్తా | టీఆర్ఎస్ |
నిజమబాద్ (రూరల్) | బాజిరెడ్డి గోవర్ధన్ | టీఆర్ఎస్ |
బాల్కొండ | వేముల ప్రశాంత్ రెడ్డి | టీఆర్ఎస్ |
బాన్సువాడ | పోచారం శ్రీనివాసరెడ్డి | టీఆర్ఎస్ |
ఎల్లారెడ్డి | జాజుల సురెందర్ | కాంగ్రెస్ |
ఆర్మూర్ | ఆశన్నగారి జీవన్రెడ్డి | టీఆర్ఎస్ |
బోధన్ | షకీల్ అహ్మద్ | టీఆర్ఎస్ |
కామారెడ్డి | గంప గోవర్థన్ | టీఆర్ఎస్ |
జుక్కల్ | హనుమంత్ సింధే | టీఆర్ఎస్ |
పోల్ గ్రాఫ్