‘మహిళా రక్షణలో పోలీసులు భేష్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహిళల రక్షణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని మోల్డ్ టెక్ ప్యాకేజింగ్ సీఎండీ లక్ష్మణ్ ప్రశంసించారు. చిన్నారులు, మహిళలపై నమోదవుతున్న కేసుల్లో వేగంగా స్పందించేందుకు ఏర్పాటు చేసిన షీటీమ్స్, భరోసా కేంద్రాల పనితీరును ఆయన మెచ్చుకున్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా రూ. 20 లక్షలను డీజీపీ మహేందర్రెడ్డి, విమెన్ సేఫ్టీ వింగ్ చీఫ్, ఐజీ స్వాతి లక్రాకు అందజేశారు.