సీఎం దగ్గర నాకే ఎక్స్‌పోజర్‌ దక్కింది: మంత్రి

Minister Puvvada Ajay Kumar Review Meeting Telangana Bus Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఆర్టీసీని ఎవరైతే ఖతం చేయాలని అనుకున్నారో వారే ఖతమయ్యారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. గురువారం తెలంగాణ ఆర్టీసీపై బస్‌భవన్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దగ్గర తనకే ఎక్స్‌పోజర్‌ దక్కిందని పేర్కొన్నారు. గత 5 ఏళ్లుగా ట్రాన్స్‌పోర్ట్‌ మినిస్టర్‌ అంటే ఎవరికీ తెలియదని, తాను రవాణా శాఖ మంత్రిగా రాగానే ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌ లైమ్‌లైట్‌లోకి వచ్చిందన్నారు. అదే విధంగా బస్‌భవన్‌కు రాగానే తనకు సమ్మె నోటిసు ఇచ్చారని మంత్రి పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top