2 కోట్ల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి..
గతం కంటే 14 లక్షల మెట్రిక్ టన్నులు అదనం
9 లక్షల మెట్రిక్ టన్నులు తగ్గిన కూరగాయల ఉత్పత్తి
2015-16 ఉద్యాన పంటల ఉత్పత్తి అంచనాలు విడుదల చేసిన కేంద్రం
హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉల్లి దిగుబడులు భారీగా పెరిగాయి. గత ఏడాది ఉల్లి సాగు విస్తీర్ణం తగ్గడం.. ధరలు ఆకాశానికి ఎగబాకడంతో కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. 2015-16 సీజన్లో ఉద్యాన పం టల ఉత్పత్తి మొదటి అంచనా నివేదికను కేం ద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. ఆ నివేదిక వివరాలను తెలంగాణ ఉద్యానశాఖకు పంపించింది. 2014-15లో 29.32 లక్షల ఎకరాల్లో ఉల్లి సాగు చేయగా... అప్పట్లో 1.89 కోట్ల మెట్రిక్ టన్నుల ఉల్లి దిగుబడి వచ్చింది. 2015-16 సీజన్లో 29.45 లక్షల ఎకరాల్లో ఉల్లి సాగు చేశారు. గతేడాది కంటే అదనంగా 13 లక్షల ఎకరాల్లో ఉల్లి సాగు విస్తీర్ణం పెరిగింది. దీంతో 2.03 కోట్ల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అయింది. గత ఏడాది కంటే అదనంగా 14 లక్షల మెట్రిక్టన్నుల దిగుబడి వచ్చింది. తెలంగాణ ఉద్యానశాఖ కూడా ఉల్లి సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు కృషి చేసింది. గతంలో రాష్ట్రంలో 37,500 ఎకరాల్లో ఉల్లిసాగు విస్తీర్ణం ఉం డగా... ఈ ఏడాది అదనంగా మరో 25 వేల ఎకరాల్లో విస్తీర్ణాన్ని పెంచేందుకు కృషి జరి గింది. పైగా ఉల్లిసాగు చేసే రైతులకు ఎకరానికి రూ.5 వేల సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు.
కూరగాయలపై కరువు దెబ్బ
కరువు పరిస్థితుల నేపథ్యంలో సాగు విస్తీర్ణం తగ్గడంతో కూరగాయల దిగుబడులు తగ్గాయి. 2014-15లో కూరగాయల సాగు విస్తీర్ణం 2.38 కోట్ల ఎకరాల్లో ఉండగా.. ఆ ఏడాది 16.94 కోట్ల మెట్రిక్ టన్నులు పండాయి. 2015-16లో 2.36 కోట్ల ఎకరాల్లో కూరగాయల సాగు జరగ్గా.. దిగుబడి 16.85 కోట్లకు పడిపోయింది. గత ఏడాది కంటే 9 లక్షల మెట్రిక్ టన్నులు తగ్గింది. వంకాయ, క్యాబేజీ, బీన్స్, క్యాప్సికం తదితర వాటి ఉత్పత్తి భారీగా పడిపోయింది. ఆలుగడ్డ, టమాట దిగుబడులు మాత్రం పెరిగాయి. టమాట 1.82 కోట్ల మెట్రిక్ టన్నులు పండింది. గత ఏడాది కంటే టమాట 19 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా పండటం గమనార్హం. ఆలుగడ్డ 4.80 కోట్ల మెట్రిక్ టన్నులు పండింది. కూరగాయల దిగుబడులు తగ్గడంతో వాటి ధరలు పెరిగే అవకాశం ఉందని గమనించిన కేంద్రం నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రాలను ఆదేశించింది.
24 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా పండ్ల దిగుబడి
దేశవ్యాప్తంగా పండ్ల దిగుబడి గత ఏడాది కంటే 24 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా ఉండటం గమనార్హం. 2014-15లో అన్ని రకాల పండ్ల దిగుబడి 8.66 కోట్ల మెట్రిక్ టన్నులు ఉండగా... 2015-16లో 8.90 కోట్ల మెట్రిక్ టన్నులకు పెరిగింది. గత ఏడాది కంటే సాగు విస్తీర్ణం పెరగడమే ఇందుకు కారణం. ఇదిలావుంటే సుగంధ ద్రవ్యాలు గత ఏడాది 28.09 కోట్ల మెట్రిక్ టన్నులు కాగా... ఈ ఏడాది 28.24 కోట్ల మెట్రిక్ టన్నులకు పెరిగింది.
భారీగా పెరిగిన ఉల్లి దిగుబడులు
Published Mon, Mar 14 2016 2:39 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement