భర్తతో గొడవపడి భార్య అదృశ్యం | Married woman missing | Sakshi
Sakshi News home page

భర్తతో గొడవపడి భార్య అదృశ్యం

Sep 11 2015 5:51 PM | Updated on Sep 3 2017 9:12 AM

కుటుంబ సభ్యులకు చెప్పకుండా బయటకు వెళ్లిన గృహిణి కనిపించకుండాపోయిన ఘటన బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది.

బహదూర్‌పురా (హైదరాబాద్) : కుటుంబ సభ్యులకు చెప్పకుండా బయటకు వెళ్లిన గృహిణి కనిపించకుండాపోయిన ఘటన బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది. ఎస్సై ఎం.విజయ్ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం... కిషన్‌బాగ్ నందిముస్లాయిగూడ ప్రాంతానికి చెందిన సయ్యద్ యాకుబ్ మజానీ, ఆస్రా పర్వీన్ (27)లు దంపతులు. వీరిది ఉమ్మడి కుటుంబం. కాగా యాకుబ్ మజానీ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే గత కొన్నిరోజులుగా ఆస్రా పర్వీన్ వేరు కాపురం పెడదామంటూ భర్తతో గొడవ పడుతోంది.

ఈ నేపథ్యంలోనే ఈ నెల 9వ తేదీన సాయంత్రం 4 గంటల సమయంలో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్నేహితులు, బంధువుల వద్ద వెతికినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. దీంతో యాకుబ్ మజానీ శుక్రవారం బహదూర్‌పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆచూకీ తెలిసిన వారు బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్ ఫోన్ 040-27854794 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement