బ్యాంక్‌ ఖాతాతోనే ఖర్చులు చూపాలి | Manik Raj Special Interview on Lok Sabha Election | Sakshi
Sakshi News home page

బ్యాంక్‌ ఖాతాతోనే ఖర్చులు చూపాలి

Mar 18 2019 9:30 AM | Updated on Mar 18 2019 9:30 AM

Manik Raj Special Interview on Lok Sabha Election - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: లోక్‌సభ ఎన్నికల కోసం నేటినుంచి నామినేషన్ల ఘట్టం ప్రారంభం కానుంది. బరిలో దిగే అభ్యర్థులకు జిల్లా కలెక్టర్, హైదరాబాద్‌ రిటర్నింగ్‌ అధికారి కె. మాణిక్‌ రాజ్‌  కొన్ని సూచనలు చేశారు. అవి ఇలాఉన్నాయి..
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్‌ దాఖలు చేసే ముందు రోజు తన పేరిట బ్యాంక్‌ ఖాతాను తెరవాలి  
ఎన్నికల సమయంలో చేసే ఖర్చు మొత్తం బ్యాంక్‌ ఖాతా ద్వారానే చేయాలి
నామినేషన్‌తో పాటు అభ్యర్థి మూడు నెలల లోపు తీసుకున్న తన ఫొటో కూడా జతచేయాలి
నామినేషన్‌తోపాటు అఫిడవిట్‌ను కూడా పొందుపర్చాలి
ఆఖరిరోజు సదరు అభ్యర్థి ప్రతిజ్ఞ చేయాలి
నామినేషన్‌తో పాటు అభ్యర్థి సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.25వేలు నగదు లేదా చలానా రూపేణా సమర్పించాలి
అభ్యర్థి ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి చెందిన వారైతే రూ.12,500ను సెక్యూరిటీ డిపాజిట్‌ చేస్తూ కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి
హైదరాబాద్‌ కలెక్టరేట్‌ కార్యాలయంలోనే హైదరాబాద్, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ నామినేషన్లను ఈ నెల 18 నుంచి ఈ నెల 25 వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరిస్తారు. ఈ నెల 21, 23, 24వ తేదీల్లో సెలవుల కారణంగా నామినేషన్లు స్వీకరణ ఉండదు.

Advertisement
 
Advertisement
Advertisement