రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి | Man dies in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి

Jan 14 2016 8:11 PM | Updated on Oct 9 2018 5:43 PM

వేగంగా వెళ్తున్న వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన కరీంనగర్ జిల్లా గోదావరిఖని బస్టాండ్ సమీపంలో గురువారం చోటుచేసుకుంది.

గోదావరిఖని (కరీంనగర్) : వేగంగా వెళ్తున్న వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన కరీంనగర్ జిల్లా గోదావరిఖని బస్టాండ్ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. సదారాం సురేష్(45) ఎన్టీపీసీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. కాగా గురువారం సాయంత్రం గోదావరిఖని బస్టాండ్ సమీపంలో రోడ్డు దాటుతుండగా.. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement