లారీ ఢీకొని వ్యక్తి మృతి | Man dies in road accident | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని వ్యక్తి మృతి

Nov 17 2015 3:47 PM | Updated on Aug 30 2018 3:56 PM

ఇటుకల లోడ్‌తో వెళుతున్న టాటా మ్యాజిక్ వాహనాన్ని ఓ లారీ ఢీకొనగా వ్యాపారి దుర్మరణం పాలయ్యాడు.

అశ్వారావుపేట (ఖమ్మం) : ఇటుకల లోడ్‌తో వెళుతున్న టాటా మ్యాజిక్ వాహనాన్ని ఓ లారీ ఢీకొనగా వ్యాపారి దుర్మరణం పాలయ్యాడు. ఖమ్మం జిల్లా ములకలపల్లి మండలం రాజాపురం వద్ద మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. మణుగూరు నుంచి ఓ వ్యాపారి ఇటుకలను తీసుకుని పశ్చిమగోదావరి జిల్లా విజయరాయికి వెళుతున్నాడు. రాజాపురం వద్ద ఓ లారీ టాటా మ్యాజిక్ వాహనాన్ని ఢీకొంది. దీంతో వాహనం నడుపుతున్న వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడగా... వ్యాపారి గోలెపు పొచ్చయ్య (30) తీవ్ర గాయాలతో వాహనంలోనే ఇరుక్కుపోయి ప్రాణాలు విడిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement