తెలంగాణ స్పీకర్గా మధుసూదనాచారి.. డిప్యూటీగా పద్మా దేవేందర్ | Madhusudhana chari to be as Telangana speaker, Padma devender reddy as deputy speaker | Sakshi
Sakshi News home page

తెలంగాణ స్పీకర్గా మధుసూదనాచారి.. డిప్యూటీగా పద్మా దేవేందర్

Jun 8 2014 3:43 PM | Updated on Oct 8 2018 3:41 PM

తెలంగాణ స్పీకర్గా మధుసూదనాచారి.. డిప్యూటీగా పద్మా దేవేందర్ - Sakshi

తెలంగాణ స్పీకర్గా మధుసూదనాచారి.. డిప్యూటీగా పద్మా దేవేందర్

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్గా పద్మా దేవందర్ రెడ్డి పేర్లను ఖరారు చేశారు.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్గా పద్మా దేవందర్ రెడ్డి పేర్లను ఖరారు చేశారు. పార్టీ శ్రేణులతో చర్చించిన అనంతరం టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు  వీరిద్దరినీ ఎంపిక చేశారు.

స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిపక్షాలతో చర్చించనుంది. ఈ నెల 11న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అదే రోజున స్పీకర్ను ఎన్నుకుంటారు.

Advertisement
 
Advertisement
Advertisement