నెత్తురోడుతున్న రోడ్లు,10మంది దుర్మరణం | Lorry hits Auto: 14 Killed in Mahabubnagar district | Sakshi
Sakshi News home page

నెత్తురోడుతున్న రోడ్లు,10మంది దుర్మరణం

Aug 20 2014 12:05 PM | Updated on Aug 30 2018 3:58 PM

తెలంగాణలో రహదారులు నెత్తురోడుతున్నాయి. రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది దుర్మరణం చెందారు.

మహబూబ్‌నగర్ : తెలంగాణలో రహదారులు నెత్తురోడుతున్నాయి. రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. మహబూబ్ నగర్ జిల్లా మాగనూరు సమీపంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్‌ బంక్‌ వద్ద ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద ధాటికి మృతదేహాలన్నీ చెల్లాచెదురయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు మక్తల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆటో కృష్ణా గ్రామం నుంచి మక్తల్‌ వెళ్తుండగా ప్రమాదం సంభవించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement