లతిత అమ్మగారి భోజనం.. భళా

Lalitha Ammagari Bojanam Restaurant Open in Banjarahills - Sakshi

జూబ్లీహిల్స్‌: ఆహ్లాదకరమైన వాతావరణంతో రుచిరకరమైన భోజనాన్ని అందుబాటులో ఉంచిన ‘లలిత అమ్మ గారి భోజనం’ రెస్టారెంట్‌ నిర్వాహకులు అభినందనీయులని... నాణ్యత, శుభ్రతతో రుచికరమైన వంటకాలను అందించి భోజనప్రియుల ఆదరణ పొందాలని హోంమంత్రి మహమూద్‌అలీ పేర్కొన్నారు. బంజారాహిల్స్‌ రోడ్‌నం.12 లో లలిత అమ్మ గారి భోజనం పేరుతో ఏర్పాటు చేసిన రెస్టారెంట్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సందీప్‌రాజ్, ప్రణయ్‌ మాట్లాడుతూ... 90 శాతం మంది మహిళా సిబ్బందితో ఈ హోటల్‌ నిర్వహిస్తున్నామన్నారు. రుచికరమైన వెజ్, నాన్‌వెజ్‌ వంటకాలు ఉన్నాయన్నారు.

రెస్టారెంట్‌ను ప్రారంభిస్తున్నహోంమంత్రి మహమూద్‌ అలీ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top