ఉద్యమకారులపై కేసులు ఉపసంహరించాలి | kishan reddy requests union minister to withdraw cases | Sakshi
Sakshi News home page

ఉద్యమకారులపై కేసులు ఉపసంహరించాలి

Jun 20 2014 12:50 AM | Updated on Apr 3 2019 8:52 PM

ఉద్యమకారులపై కేసులు ఉపసంహరించాలి - Sakshi

ఉద్యమకారులపై కేసులు ఉపసంహరించాలి

ఉద్యమకారులపై రైల్వే అధికారులు పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడను కోరారు.

రైల్వే శాఖ మంత్రికి కిషన్‌రెడ్డి లేఖ


 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో భాగంగా రైల్‌రోకో తదితర ఆందోళనల్లో పాల్గొన్న ఉద్యమకారులపై రైల్వే అధికారులు పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడను కోరారు. ఈ మేరకు ఆయన మంత్రికి లేఖ రాశారు. 60 ఏళ్ల తెలంగాణ పోరాటంలో భాగంగా ఎంతోమంది బలిదానాలకు సిద్ధపడ్డారని, అలాంటి ఉద్యమంలో రైల్ రోకోలు కూడా భాగమయ్యాయని తెలిపారు. ఆందోళనల సందర్భంగా నమోదైన కేసులు ఉద్యమకారులను ఇప్పటికీ వెంటాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.


 

Advertisement
 
Advertisement
Advertisement