హరియాణాలో ఖమ్మం విద్యార్థి ఆత్మహత్య | khammam btech student suicide in haryana state | Sakshi
Sakshi News home page

హరియాణాలో ఖమ్మం విద్యార్థి ఆత్మహత్య

Feb 17 2017 3:59 AM | Updated on Sep 5 2017 3:53 AM

(ఫైల్ ఫొటో)

(ఫైల్ ఫొటో)

హరియాణా బీఎంఎల్‌ ముంజాల్‌ యూనివర్సిటీలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

బీఎంఎల్‌ వర్సిటీలో బీటెక్‌ ఫస్టియర్‌ చదువుతున్న మణిదీప్‌
సాక్షి, న్యూఢిల్లీ:
హరియాణాలోని గురుగా వ్‌లో ఉన్న బీఎంఎల్‌ ముంజాల్‌ యూని వర్సిటీలో బీటెక్‌ చదువుతున్న మణిదీప్‌ రంగా అనే తెలుగు విద్యార్థి బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లా వైరాకు చెందిన మణిదీప్‌ ఇటీవల జరిగిన బీటెక్‌ ఫస్టియర్‌ పరీక్షల్లో నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయ్యాడు. దీంతో మనస్తాపం చెంది బుధవారం రాత్రి అతను ఆత్మహత్య చేసు కున్నట్లు సమాచారం.

ఈ ఘటనపై వర్సిటీలో చదువుతున్న ఇతర తెలుగు విద్యార్థులు ధర్నాకు దిగారు. వర్సిటీలో సరైన ఫ్యాకల్టీ, విద్యా బోధన లేదని నిరసన  చేపట్టారు. అదనపు ఫీజులు వసూలు చేయాలనే దురుద్దేశంతో యాజమాన్యం కావాలనే విద్యార్థులను పరీక్షల్లో ఫెయిల్‌ చేస్తోందని ఆరోపిం చారు. దీనిపై వర్సిటీ డీన్‌ స్పందిస్తూ విద్యార్థి ఆత్మహత్యకు పరీక్షల్లో తప్పడం కారణం కాకపోవచ్చని, ఇతర కారణాల వల్లే ఆత్మహత్యకు పాల్పడి ఉండొ చ్చని పేర్కొన్నా రు. విద్యార్థి మరణవార్తను తల్లిదండ్రులకు తెలియజేశామని, మృతదేహాన్ని స్వగ్రామా నికి తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పోలీసులు మణిదీప్‌ మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement