breaking news
BML university
-
హరియాణాలో ఖమ్మం విద్యార్థి ఆత్మహత్య
బీఎంఎల్ వర్సిటీలో బీటెక్ ఫస్టియర్ చదువుతున్న మణిదీప్ సాక్షి, న్యూఢిల్లీ: హరియాణాలోని గురుగా వ్లో ఉన్న బీఎంఎల్ ముంజాల్ యూని వర్సిటీలో బీటెక్ చదువుతున్న మణిదీప్ రంగా అనే తెలుగు విద్యార్థి బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లా వైరాకు చెందిన మణిదీప్ ఇటీవల జరిగిన బీటెక్ ఫస్టియర్ పరీక్షల్లో నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో మనస్తాపం చెంది బుధవారం రాత్రి అతను ఆత్మహత్య చేసు కున్నట్లు సమాచారం. ఈ ఘటనపై వర్సిటీలో చదువుతున్న ఇతర తెలుగు విద్యార్థులు ధర్నాకు దిగారు. వర్సిటీలో సరైన ఫ్యాకల్టీ, విద్యా బోధన లేదని నిరసన చేపట్టారు. అదనపు ఫీజులు వసూలు చేయాలనే దురుద్దేశంతో యాజమాన్యం కావాలనే విద్యార్థులను పరీక్షల్లో ఫెయిల్ చేస్తోందని ఆరోపిం చారు. దీనిపై వర్సిటీ డీన్ స్పందిస్తూ విద్యార్థి ఆత్మహత్యకు పరీక్షల్లో తప్పడం కారణం కాకపోవచ్చని, ఇతర కారణాల వల్లే ఆత్మహత్యకు పాల్పడి ఉండొ చ్చని పేర్కొన్నా రు. విద్యార్థి మరణవార్తను తల్లిదండ్రులకు తెలియజేశామని, మృతదేహాన్ని స్వగ్రామా నికి తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పోలీసులు మణిదీప్ మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు. -
ఢిల్లీలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య
వైరా: ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి ఢిల్లీలోని బీఎమ్ఎల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లాలోని వైరా పట్టణానికి చెందిన రంగ క్రిష్ణారావు కుమారుడు మణిదీప్(18) ఢిల్లీలోని బీఎమ్ఎల్ యూనివర్సిటీలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. కాగా బుధవారం క్యాంపస్లోని తన గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఢిల్లీ బయలుదేరారు. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదని, మృతిపై అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.