భ్రమల తెలంగాణగా మారుస్తున్నారు..
బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ భ్రమల తెలంగాణగా మారుస్తున్నారని కాంగ్రెస్ ..
హైదరాబాద్: బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ భ్రమల తెలంగాణగా మారుస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ..కేసీఆర్ సర్వే ఒక కిలాడీ మార్క్ సర్వేగా అభివర్ణించారు. అభద్రతా భావంతో కేసీఆర్ ఇలాంటి సర్వేలు చేయిస్తున్నారని ద్వజమెత్తారు.
సర్వేలతో ప్రజా సమస్యలు పక్క దారి పట్టిస్తున్నారని ఆరోపించారు. సెక్యూరిటీ వదిలేసి ముసుగులో వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని కేసీఆర్కు పొంగులేటికి సూచించారు.