ఓటు వేస్తేనే రెట్టింపు ఆనందం: కౌశల్‌ | Kaushal React on Vote Rights In Telangana Elections | Sakshi
Sakshi News home page

ఓటు వేస్తేనే రెట్టింపు ఆనందం: కౌశల్‌

Nov 16 2018 10:48 AM | Updated on Jul 18 2019 1:45 PM

Kaushal React on Vote Rights In Telangana Elections - Sakshi

హైదరాబాద్‌: ఓటు వేయడం ద్వారా సంతృప్తి లభించడమే కాదు మనం ఓటు వేసిన నాయకుడు గెలిస్తే ఆ తృప్తి రెండింతలవుతుంది. మనం ఓటు వేసి గెలిపించుకున్న ప్రజాప్రతినిధి పనులు చేయకపోతే ప్రశ్నించేందుకు అవకాశం ఉంటుంది. పని చేస్తే ప్రశంసించేందుకు అవకాశం దక్కుతుంది. దేశ భవిష్యత్‌ గురించి మన భవిష్యత్‌ గురించి ఆలోచించి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. మన నాయకులను మనమే ఎన్నుకున్నామన్న తృప్తి మిగలాలి.

ఓటు వేస్తేనే ప్రశ్నించే హక్కు లభిస్తుందనే విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఓటు విషయంలో అందరూ ఒక్కటే. ప్రతి ఒక్కరూ లైన్‌లో నిలబడి తప్పనిసరిగా ఓటు వేయాలి. నేను ప్రతిసారీ ఓటుహక్కు తప్పనిసరిగా వినియోగించుకుంటాను.కౌశల్, నటుడు, బిగ్‌బాస్‌– 2 విజేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement