కేతకీలో కర్ణాటక మంత్రి పూజలు | karnataka minister Eshwar Khandre visits ketaki temple in medak district | Sakshi
Sakshi News home page

కేతకీలో కర్ణాటక మంత్రి పూజలు

Jun 30 2016 3:15 PM | Updated on Oct 30 2018 5:50 PM

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన మెదక్ జిల్లా కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయంలో కర్ణాటక రాష్ట్ర మున్సిపాల్ శాఖ మంత్రి ఈశ్వర్ బీమన్న ఖండ్రే సతీసమేతంగా పూజలు నిర్వహించారు.

ఝరాసంగం రూరల్: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన మెదక్ జిల్లా కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయంలో కర్ణాటక రాష్ట్ర మున్సిపాల్ శాఖ మంత్రి ఈశ్వర్ బీమన్న ఖండ్రే సతీసమేతంగా పూజలు నిర్వహించారు. గురువారం సంగమేశ్వర స్వామి దర్శన నిమిత్తం వచ్చిన మంత్రి దంపతులకు ఆలయ అర్చకులు, ఈవో మోహన్‌రెడ్డిలు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వార్లకు దర్శించుకోని ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement