ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి | Jana reddy meeting with speaker Madhusudhana Chary | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి

Nov 18 2014 9:59 AM | Updated on Aug 11 2018 6:42 PM

ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి - Sakshi

ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి

పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన రెడ్యానాయక్, యాదయ్యలపై వెంటనే అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నాయకుడు కె.జానారెడ్డి ... తెలంగాణ శాసన సభ స్పీకర్ ఎస్. మధుసూధనాచారిని డిమాండ్ చేశారు.

హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన రెడ్యానాయక్, యాదయ్యలపై వెంటనే అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నాయకుడు కె.జానారెడ్డి ... తెలంగాణ శాసన సభ స్పీకర్ ఎస్. మధుసూధనాచారిని డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం స్పీకర్ చాంబర్లో మధుసూధనాచారిని జానారెడ్డి కలిశారు.

శాసనసభలో టీఆర్ఎస్ బ్లాక్లో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూర్చుంటున్నారని... ఆయన స్పీకర్కు గుర్తు చేశారు. మీ కళ్ల ఎదుటే జరుగుతున్న ఈ వ్యవహారానికి ఇంకా సాక్ష్యాలు కావాలా అంటూ స్పీకర్ను ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై వేటు వేయాలని జానారెడ్డి ఈ సందర్భంగా స్పీకర్ను కోరారు. 

Advertisement
 
Advertisement
Advertisement