వికటించిన వ్యాక్సిన్‌.. 15 మందికి అస్వస్థత

In Hyderabad Nampally Vaccine Reaction 15 Children Get Health Problems - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: నాంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. అర్బన్ హెల్త్ సెంటర్‌లో వ్యాక్సిన్‌ వేసుకున్న 15 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే చికిత్స నిమిత్తం వారిని నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు చిన్నారుల ఆరోగ్య పరిస్థితి విషమమంగా ఉందని వైద్యులు తెలిపారు. వ్యాక్సిన్‌ తర్వాత నొప్పికి ఇవ్వాల్సిన టాబ్లెట్లు వేరేవి ఇవ్వడంతో ఈ ఘటన జరిగింది. విషయం తెలిసిన బాధిత కుటుంబ సభ్యులు నిలోఫర్ ఆస్పత్రికి చేరుకున్నారు. దాంతో ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top