పట్టాలపై నిలిచిపోయిన మెట్రో | Hyderabad Metro Rail Stuck On Track Due To Technical Issue | Sakshi
Sakshi News home page

పట్టాలపై నిలిచిపోయిన మెట్రో

Jul 24 2019 11:52 AM | Updated on Jul 24 2019 7:53 PM

Hyderabad Metro Rail Stuck On Track Due To Technical Issue - Sakshi

హైదరాబాద్‌ : నగరంలోని మెట్రో ప్రయాణికులకు బుధవారం చేదు అనుభవం ఎదురైంది. సాంకేతిక సమస్య తలెత్తడంతో ఎర్రమంజిల్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలో రైలు నిలిచిపోయింది. ఉదయం పూట కావడంతో మెట్రోలో జనాలు అధికంగా ఉన్నారు. మెట్రో ట్రాక్‌పై నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. దీంతో 20 నిమిషాల పాటు ప్రయాణికులు ఇబ్బంది పడినట్టుగా సమాచారం. మెట్రో రైలు పట్టాలపై నిలిచిపోవడంతో పలువురు సోషల్‌ మీడియా ద్వారా తమ బాధను వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధంచి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement