గుడిసె దగ్ధం వృద్ధ మహిళకు గాయాలు | hut gutted in fire | Sakshi
Sakshi News home page

గుడిసె దగ్ధం వృద్ధ మహిళకు గాయాలు

Feb 16 2015 12:27 PM | Updated on Sep 5 2018 9:45 PM

ఇంటి పై నుంచి వెళ్తున్న కరెంట్ తీగల్లో మంటలు చేలరేగి గుడిసె దగ్ధమైంది.

ఆదిలాబాద్: ఇంటి పై నుంచి వెళ్తున్న కరెంట్ తీగల్లో మంటలు చేలరేగి గుడిసె దగ్ధమైంది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామంలో సోమవారం జరిగింది. లింగాపూర్ గ్రామానికి చెందిన ముసుగు పోసాని(70) అనే వృద్ధ మహిళ గుడిసె మంటల్లో ఇరుక్కొవడంతో తీవ్ర గాయాలయ్యాయి.

ఈ ప్రమాదంలో సుమారు రూ. 50 వేల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. విషయం తెలిసిన రెవిన్యూ అధికారి సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. వృద్ధ మహిళకు ఆర్థిక సాయం చేస్తామని హామినిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement