బురదలో పడిన హరీష్‌రావు.. తప్పిన ప్రమాదం | Harish rao slips down while on mission kakaitya works | Sakshi
Sakshi News home page

బురదలో పడిన హరీష్‌రావు.. తప్పిన ప్రమాదం

Apr 29 2015 7:12 PM | Updated on Sep 3 2017 1:07 AM

బురదలో పడిన హరీష్‌రావు.. తప్పిన ప్రమాదం

బురదలో పడిన హరీష్‌రావు.. తప్పిన ప్రమాదం

మిషన్ కాకతీయ పనులను పర్యవేక్షించేందుకు వెళ్లిన భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ప్రమాదవ శాత్తు బురదలో కూరుకుపోయారు.

నంగునూర్(మెదక్ జిల్లా): మిషన్ కాకతీయ పనులను పర్యవేక్షించేందుకు వెళ్లిన భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ప్రమాదవ శాత్తు బురదలో కూరుకుపోయారు. ఈ సంఘటన బుధవారం మెదక్ జిల్లా నంగునూర్ మండలంలోని ఎర్రచెరువు వద్ద జరిగింది. వివరాలు.. మండలంలోని ఎర్రచెరువు పూడిక తీతకు రూ.55లక్షలను కేటాయించారు.

ఈ క్రమంలోనే పూడిక తీత పనులను పర్యవేక్షించేందుకు మంత్రి హరీష్‌రావు వెళ్లారు. ఆ సమయంలో మంత్రి ప్రమాదవశాత్తు ప్రొక్లేన్ పూడికతీస్తున్న మట్టిలో కూరుకుపోయారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది, డ్రైవర్‌ను హెచ్చరించడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం సిబ్బంది మంత్రిని బురదలో నుంచి బయటకు తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement