గ్రానైట్ క్వారీలో ప్రమాదం | Granite quarry accident | Sakshi
Sakshi News home page

గ్రానైట్ క్వారీలో ప్రమాదం

Jan 11 2015 1:23 AM | Updated on Sep 2 2017 7:30 PM

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు చింతలగుట్ట వద్ద గ్రానైట్ క్వారీలో శనివారం సాయంత్రం పేలుడు సంభవించి ముగ్గురు కార్మికులు మృతి చెందారు.

  • ముగ్గురు కార్మికులు మృతి
  •  శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు చింతలగుట్ట వద్ద గ్రానైట్ క్వారీలో శనివారం సాయంత్రం పేలుడు సంభవించి ముగ్గురు కార్మికులు మృతి చెందారు.  క్వారీలో కార్మికులు డ్రిల్లింగ్ చేసి డిటోనేటర్ అమర్చుతుండగా పేలుడు జరిగినట్టు స్థానికులు అనుమానిస్తుండగా, బండరాయి కూలడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు.

    క్వారీలో బీహార్, తమిళనాడుకు చెందిన కూలీలు కొన్ని నెలలుగా పనులు చేస్తున్నారు. రోజు మాదిరిగానే శనివారం డ్రిల్లింగ్ పనులను బిహార్‌కు చెందిన అజయ్‌నాయక్(22), రాహుల్‌నాయక్(21), బికారీ నాయక్(23), తమిళనాడుకు చెందిన మరియప్పన్(47), పలనీ(45)లు చేస్తున్నారు. మరికొందమంది కార్మికులు మరోచోట డ్రిల్లింగ్ చేసి, డిటోనేటర్‌లు అమర్చారు.

    ఇంతలో పేలుడు జరిగిందో, బండరాయి కూలిపోయిందో కానీ భారీ ప్రమాదం జరిగింది. అజయ్‌నాయక్, రాహుల్‌నాయక్, మరియప్పన్ అక్కడికక్కడే మృతిచెందగా, బికారీనాయక్‌కు తీవ్రగాయాలయ్యాయి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement