అశ్వారావుపేట మండలంలోని వినాయకపురానికి చెందిన మస్తాన్ అనే రైతు జీడిమామిడి తోటలో ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
ఖమ్మం: అశ్వారావుపేట మండలంలోని వినాయకపురానికి చెందిన మస్తాన్ అనే రైతు జీడిమామిడి తోటలో ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం వల్ల సుమారు రూ.లక్ష నష్టం వాటిల్లింది. వేసవి కాలం కావటంతో జీడిమామిడి చెట్ల ఆకులు రాలి పోయాయి. ఎవరో గుర్తుతెలియని వ్యక్తి సిగరెట్ తాగి పడేయటంతో ఆకులకు తగులుకొని ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.
(అశ్వారావుపేట)