బాసర ఆలయ ప్రాంగణంలో అగ్నిప్రమాదం
బాసర : ఆదిలాబాద్ జిల్లా బాసరలోన అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఓ జనరల్ స్టోర్లో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు జరిగింది. ప్రమాదం గమనించిన సిబ్బంది అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన వచ్చి మంటలను అదుపు చేశారు. ఉన్నట్టుండి మంటలు చెలరేగడంపై సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా కావాలని నిప్పుపెట్టారా లేక షార్ట్సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయా అనేది మిస్టరీగా ఉంది. పోలీసులకు సమాచారం అందించారు.