125 మందికి నేత్ర వైద్య పరీక్షలు

Eye Tests For 125 People - Sakshi

బరంపురం : స్థానిక హనుమాన్‌ బజార్‌ మెయిన్‌ రోడ్డులోని మానస్‌ భవన్‌లో హింజిలికాట్, సమరజోలొ శంకర్‌ ఐ ఆస్పత్రి, లయన్స్‌ క్లబ్‌ గెలక్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బరంపురం అదనపు తహసీల్దార్‌ సుశాంత్‌ కుమార్‌ సాహు పాల్గొని ప్రారంభించారు. శంకర్‌ ఐ ఆస్పత్రికి చెందిన నేత్ర వైద్యులు 125 మంది రోగులకు నేత్ర వైద్య పరీక్షలు చేశారు.

ఇందులో 25 మందిని శస్త్రచికిత్సలకు ఎంపిక చేశారు. వీరిని అవసరమైతే శంకర్‌ ఫౌండేషన్‌ ఐ ఆస్పత్రికి తరలించనున్నట్టు లయన్స్‌ క్లబ్‌ గెలక్స్‌ ప్రాజెక్టు చైర్మన్‌ పి.ధర్మారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్‌ ప్రతినిధులు పి.కె.పండా, లక్ష్మీనారాయణ, రజని పాత్రో, స్వాయ్యక్‌ సాహు, సరస్వతి పాత్రో, రజని మహాపాత్రో, ఉషారాణి పాఢి, సభి పాత్రో తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top