ఇంజనీరింగ్‌ విద్యార్థి అదృశ్యం | Engineering student disappears | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్‌ విద్యార్థి అదృశ్యం

Jul 11 2017 3:21 AM | Updated on Nov 9 2018 4:36 PM

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పులిగిల్లకు చెందిన వరికుప్పల గణేష్‌ ఈనెల 6 నుంచి కనిపించకుండా పోయాడు.

- ప్రియురాలితో కలసి భద్రాచలం పయనం
మార్గమధ్యలో చనిపోవాలని నిర్ణయం.. తప్పించుకొని వచ్చిన ప్రియురాలు 
గణేష్‌ ఆచూకీ కోసం గాలింపు 
 
వలిగొండ : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పులిగిల్లకు చెందిన వరికుప్పల గణేష్‌ ఈనెల 6 నుంచి కనిపించకుండా పోయాడు. ఆందోళన చెందిన అతడి తండ్రి.. ఆదివారం ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఘట్‌కేసర్‌ సమీప కళాశాలలో గణేష్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. అదే కళాశాలలో చదువుతున్న సహవిద్యార్థినితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ కలసి భద్రాచలం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఈ నెల 6న సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. వారి దగ్గర డబ్బులు లేకపోవడంతో గణేష్‌ తన మొబైల్‌ను విక్రయించాడు.ఆ డబ్బులతో మణుగూరు రైలు ఎక్కి మధ్యలో దిగారు. అక్కడ లాడ్జి తీసుకున్నారు.

ఈ సమయంలో ఇద్దరం చనిపోదామని గణేష్‌ చేసిన ప్రతిపాదనను ప్రేమికురాలు వ్యతిరేకించింది. అయినప్పటికీ గణేష్‌ వినకుండా క్రిమిసంహారక మందు కొనడానికి ఆమె చేతి ఉంగరాన్ని తీసుకుని అమ్మడానికి బయటకు వెళ్లాడు. ఈ సమయంలో ఆమె లాడ్జి నుంచి బయటకు వచ్చి ఎలాగోలా హైదరాబాద్‌కు చేరుకుంది. ఎప్పటిలాగే కాలేజీకి వెళ్లి జరిగిన విషయాన్ని ప్రిన్సిపాల్‌కు చెప్పింది. ఈ విషయాన్ని కళాశాలకు చెందిన అధ్యాపకుడు గణేష్‌ తండ్రికి సమాచారం అందించాడు. ఆయన ఘట్‌కేసర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సోమవారం తెల్లవారు జామున గణేష్‌ తండ్రి కుమారుని వెతికేందుకు భద్రాచలం వెళ్లారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement