ఊరకుక్కల దాడిలో 40 గొర్రెలు మృతి | Dogs Attack Sheeps Died | Sakshi
Sakshi News home page

ఊరకుక్కల దాడిలో 40 గొర్రెలు మృతి

Apr 8 2018 12:22 PM | Updated on Sep 29 2018 3:55 PM

Dogs Attack Sheeps Died - Sakshi

 కుక్కల దాడిలో మృతిచెందిన గొర్రెలు

దోమ : ఊరకుక్కల దాడిలో 40 గొర్రెలు మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని ఐనాపూర్‌ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నల్ల చిన్నయ్యకు చెందిన 100 గొర్రెలను తన పొలం దగ్గర మంద చేసి ఉదయం ఇంటికి వచ్చాడు. ఉదయం 10 గంటల సమయంలో ఊరకుక్కలు ఆ మందపై దాడి చేయడంతో 40 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెలను మేపేందుకు పొలానికి వెళ్లగా గొర్రెలు మృతి చెంది కుప్పలుగా పడి ఉన్నాయి. కష్టపడి పొషించిన గొర్రెలు ఒకేసారి మృతి చెందడంతో రైతు దిక్కుతోచి స్థితిలో ఉన్నాడు. దీంతో రైతుకు తీవ్రంగా ఆర్థిక నష్టం వాటిల్లింది. ప్రభుత్వం తమకు ఆర్థిక సహాయం అందించాలని ఆయన కోరుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement