తెలంగాణలో కరోనాకు ఉచిత చికిత్స | Telangana Govt Decision Over Free Treatment for Corona Patients - Sakshi
Sakshi News home page

తెలంగాణలో కరోనాకు ఉచిత చికిత్స

Jul 15 2020 11:27 AM | Updated on Jul 15 2020 3:32 PM

Decision To Provide Corona Healing Free Of Charge In Telangana - Sakshi

ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కరోనాకు ఉచితంగా చికిత్స అందించాలని నిర్ణయం తీసుకుంది.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కరోనాకు ఉచితంగా చికిత్స అందించాలని నిర్ణయం తీసుకుంది. అందులోభాగంగా మొదట మూడు ప్రైవేట్‌ మెడిక‌ల్ కాలేజీల‌ను ఎంపిక చేసింది. మల్లారెడ్డి, మమత, కామినేని మెడికల్ కాలేజీల్లో కరోనా టెస్టులు, చికిత్స ఉచితంగా అందించేలా ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. కాగా,  తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 37,745కి చేరుకుంది. మృతుల సంఖ్య 375కి పెరిగింది. చదవండి: కరోనా రికవరీ రేటు 99%

Advertisement
 
Advertisement
Advertisement