అదుపు తప్పి అరటిపండ్ల డీసీఎం బోల్తా
చివ్వెంల(సూర్యాపేట) : వేగంగా వస్తున్న డీసీ ఎం అదుపు తప్పి బోల్తాపడంది. ఈ సంఘటన చివ్వెంల మండలం బీబీగూడెం గ్రామశివారులో సూర్యాపేట-ఖమ్మం రహదారిపై ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం నుంచి సూర్యాపేటకు అరటి పండ్ల లోడుతో వస్తున్న డీసీఎం బీబీగూడెం గ్రామ శివారులో అదుపు తప్పి బోల్తాపడింది. ప్రమాదంలో అరటి పండ్ల ట్రేలు కిందపడడంతో గమనించిన స్థానికులు, రహదారిపై వెళ్తున్న వాహనచోదకులు ట్రేలతో సహా అరటి పండ్లను తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ బి.ప్రవీణ్కుమార్ వెంటనే సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పండ్ల విలువ రూ.లక్ష వరకు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. తమకు ఇంతవరకు ఎవరు ఫిర్యాదు అందలేదని ఎస్ఐ తెలిపారు.