రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం | couple died in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం

Jun 30 2014 3:25 AM | Updated on Jul 10 2019 7:55 PM

రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం - Sakshi

రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని పరామర్శించేందుకు మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న దంపతులను లారీ రూపంలో మృత్యువు కబళించింది. మండలంలోని

మల్లారెడ్డిగూడెం(మేళ్లచెర్వు) :ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని పరామర్శించేందుకు మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న దంపతులను లారీ రూపంలో మృత్యువు కబళించింది. మండలంలోని జోగుకుంట సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. స్థాని కులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన మోర్తాల గోవిందరెడ్డి, మంగమ్మ దంపతులు మిర్యాలగూడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మంగమ్మ తండ్రిని పరామర్శించేందుకు ఉదయం ఇంటి నుంచి తమ మోటార్‌సైకిల్‌పై బయలుదేరారు. మండల పరిధిలోని జోగుకుం ట సమీపంలోకి రాగానే ఎదురుగా వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది.
 
 ఈ ఘటనలో గోవిందరెడ్డి(48) అక్కడికక్కడే మృతిచెందగా, మంగమ్మ(44)కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే మంగమ్మను 108 వాహనంలో కోదాడ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెం దింది. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. తల్లిదండ్రులు ప్రమాదంలో మృతిచెదడంతో వారిని ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. మృతుల ఇంటివద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అంతకుముందు విషయం తెలుసుకుని ఘటన స్థలాన్ని ఎస్‌ఐ సుమన్ పరిశీలిం చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీని అదుపులోకి తీసుకుని డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement