సాంకేతిక విద్యా శాఖలో పదోన్నతులకు కమిటీ


సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖలో పదోన్నతులకు సంబంధించిన కమిటీని పున ర్నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి, రెండో స్థాయి గెజిటెడ్ అధికారుల పదోన్నతులు, నియామకాల అంశాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఈ కమిటీ కాలపరిమితి రెండేళ్లు ఉంటుంది. సాంకేతిక విద్యా శాఖ డైరక్టర్/ కమిషనర్, కాలేజీయేట్ ఎడ్యుకేషన్ డైరక్టర్/కమిషనర్, ఉన్నత విద్యా శాఖ (సాంకేతిక విద్య) ప్రత్యేక కార్యదర్శితో ఈ కమిటీని ప్రభుత్వం పునర్నియమించింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top