తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాలకు సీఎం, మంత్రులు దూరంగా ఉన్నారు. జాతరకు సీఎం కేసీఆర్ వస్తారని, ఆయన చేతుల మీదుగానే స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని గతంలో టీఆర్ఎస్ నాయకులు చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాలకు సీఎం, మంత్రులు దూరంగా ఉన్నారు. జాతరకు సీఎం కేసీఆర్ వస్తారని, ఆయన చేతుల మీదుగానే స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని గతంలో టీఆర్ఎస్ నాయకులు చెప్పారు. తీరా సమయూనికి ఢిల్లీ పర్యటన కారణంగా ముఖ్యమంత్రి హాజరుకాలేరని తెలిపారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారని ప్రభుత్వం జీవో జారీ చేసింది. కానీ సోమవారం రాత్రి ఆయన పర్యటన రద్దరుునట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. అల్లోల స్థానంలో రాష్ట్ర ఆర్థిక, పౌరసరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రభుత్వం తరఫున స్వామివారిని పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు.
కానీ తెల్లవారేసరికి ఈటెల సైతం రాలేదు. దీంతో కలెక్టర్ నీతూకుమారిప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే సిహెచ్.రమేశ్బాబు పట్టువస్త్రాలు సమర్పించారు. ఉన్నతమైన పదవుల్లో ఉన్నవారు ఎములాడ రాజన్నను దర్శించుకుంటే తిరిగి ఎన్నికల్లో గెలువరనే ప్రచారం ఉంది. ఈ కారణంగా పదవులు కాపాడుకునేందుకే సీఎం, మంత్రులు ఎములాడ రాజన్నను విస్మరించారని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించడం గమనార్హం.