వరంగల్ నగరంలోని దేశాయిపేట, శివనగర్ ప్రాంతాల్లో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు.
వరంగల్లో చెలరేగిన చైన్ స్నాచర్లు
Mar 11 2016 3:11 PM | Updated on Sep 3 2017 7:30 PM
దేశాయిపేట: వరంగల్ నగరంలోని దేశాయిపేట, శివనగర్ ప్రాంతాల్లో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. శుక్రవారం మధ్యాహ్నం దేశాయిపేట ప్రాంతంలో ఓ స్కూల్లో పిల్లలకు భోజనం క్యారేజీ ఇచ్చి ఇంటికి తిరిగి వెళుతున్న బాగం హేమలత మెడలోని నాలుగు తులాల బంగారం గొలుసును ఆగంతకులు బైక్పై వచ్చి తెంపుకు పోయారు. అలాగే, శివనగర్ ప్రాంతంలో కవిత అనే మహిళ మెడలోనూ రెండున్నర తులాల బంగారం గొలుసును తెంపుకుపోయారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Advertisement
Advertisement