మంత్రుల చాయ్‌.. చిట్‌చాట్‌

Chai .. chit chat - Sakshi

టీ కొట్టులో కుర్చొని మిర్చిబజ్జీలు తిన్న మంత్రులు

ఇబ్రహీంపట్నంరూరల్‌ :  నిన్న మొన్నటి వరకు సామాన్య ప్రజలకే కేరాఫ్‌గా మారిన రంగారెడ్డి జిల్లా కొత్త కలెక్టరేట్‌ నిర్మాణం సమీపంలోని టీ కొట్టు ఇప్పుడు ప్రధాన్యత సంతరించుకుంది. ఈ కలెక్టరేట్‌ నిర్మాణం  పక్కనే ప్రగతి నివేదన సభ జరగనుంది. సభ ఏర్పాట్లు పర్యవేక్షించడానికి వచ్చిన మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నగర మేయర్‌ బోంతు రామ్మోహన్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిలు ఈ టీకొట్టు వద్ద ఆగి చాయ్‌ తాగారు. మిర్చితిని వెళ్లారు. నిత్యం బిజీగా గడిపే నాయకులు సామాన్య ప్రజల మాదిరిగా రోడ్డుపై చాయ్‌తాగడాన్ని అక్కడి వారు ఆశ్చర్యంగా చూశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top